ఆంధ్రప్రదేశ్‌

నేడు విశాఖలో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ఈ నెల 22న ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి హాజరుకానున్నారు. 2019 ఎన్నికలకు ప్రజా మేనిఫెస్టోను రూపొందించేందుకు ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశానుసారం 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ అనేక ఉప కమిటీలుగా ఏర్పడి ప్రజలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 22న సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు’ అంశంపై ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొని విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలకు సంబంధించి ఏపీసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికే ఇచ్చిన హామీలతో పాటు ఏఐసీసీ మేనిఫేస్టోలో పొందుపరచాల్సిన అంశాలను వివరిస్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.