ఆంధ్రప్రదేశ్
తూ.గోలో జనసేన మాలధారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 October 2018
కడియం, అక్టోబర్ 22: అయ్యప్ప, భవానీ దీక్షల మాదిరిగా మండల కేంద్రం కడియం గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం జనసేన దీక్ష తీసుకుని మాలధారణ గావించారు. 21 రోజులపాటు తామీ దీక్షలో ఉంటామని పేర్కొన్నారు. తొమ్మిది మంది యువకులు జన సేన పార్టీ పతాక రంగులైన తెలుపు, ఎరుపుతో కూడిన దుస్తులను ధరించి, దీక్ష చేపట్టారు. ఈ వినూత్న దీక్షలో అన్ని మతాల దైవాలను పూజిస్తామని దీక్షాధారుల్లో ఒకరైన అడబాల రాజు తెలిపారు. వీరిని మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు అభినందించారు.