ఆంధ్రప్రదేశ్‌

వైసీపీలో అత్యధికులు క్రిమినల్సే: అనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 5: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో అత్యధికులు నేరస్థులేనని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. ఇక్కడి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోడికత్తి డ్రామాతో నవ్వుల పాలవుతున్న వైసీపీ నేతలు, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వందలాది తప్పులు చేస్తూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారని విమర్శించారు. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా రోజుకో డ్రామా వేస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని, ఆమె నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేస్తుంటే మోదీతో రహస్య ఒప్పందం చేసుకున్న వైసీపీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేసుల మాఫీ కోసం బీజేపీ నేతలతో కుమ్మక్కైన జగన్, రాష్ట్రానికి, ప్రజలకు మేలేం చేస్తారని అనిత ప్రశ్నించారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోదీని ప్రశ్నించే ధైర్యం వైసీపీ నేతలకు లేదన్నారు. విమానాశ్రయంలో నవ్వుకుంటూ వెళ్లిన జగన్ తర్వాత బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే నటించారనే సంగతి ప్రజలకు అర్థమైందన్నారు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో చెప్పేందుకు రోజానే రోల్‌మోడల్ అని, ఆమె విమర్శించారు.