ఆంధ్రప్రదేశ్
కర్ణాటక సీఎంకు బాబు ఫోన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 November 2018
అమరావతి, నవంబర్ 6: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్చేసి వివరాలడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించటం పట్ల అభినందనలు తెలిపారు. బలహీన అభ్యర్థి కనుకే ఒక స్థానంలో పరాజయం పాలయ్యామని కుమారస్వామి వివరించారు. బీజేపీకి ప్రజలు దూరమవుతున్న క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల ఏకీకరణ అవసరమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈనెల 9వ తేదీన బెంగుళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చంద్రబాబు భేటీ కానున్నారు.