ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో ఇస్తెమా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 8: కర్నూలు శివారు నన్నూరు టోల్‌ప్లాజా వద్ద ముస్లింల అంతర్జాతీయ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇస్తెమా శనివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సుమారు 5 లక్షల మంది ముస్లింలు హాజరయ్యారు. ఆది, సోమవారం 30 లక్షల మంది వస్తరని అంచనా వేస్తున్నారు. వీరి కోసం తాత్కాలిక టెంట్లలో వసతి ఏర్పాటుచేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు ఆధ్యాత్మిక గురువు హజరత్ వౌలానా సాద్ సాహెబ్ ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, ఇస్లాం ధార్మిక విషయాలపై పలువురు ప్రసంగించనున్నారు. మైనార్టీశాఖ మంత్రి ఎన్‌ఎండీ. ఫరూఖ్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇస్తెమా జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు.