ఆంధ్రప్రదేశ్
అజ్మీర్ యాత్రికులకు సీఎం అభినందన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమరావతి, డిసెంబర్ 8: పవిత్ర అజ్మీర్ దర్గా సందర్శన యాత్రకు వెళుతున్న ముస్లిం మైనారిటీ వర్గీయులకు శుభం కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ సభ్యులు వందమందికి పైగా ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని యాత్రా విశేషాలను వివరించారు. ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలనే దీక్షతో అజ్మీర్దర్గా యాత్రకు పూనుకున్నట్లు వివరించారు. దర్గాకు సమర్పించేందుకు ఛాదర్ను మైనారిటీ నేతలు అమీర్ అలీ, అబ్దుల్ కరీం, షేక్ హుస్సేన్, పట్టణ ప్రధానకార్యదర్శి షేక్ నాగుల్మీరా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నారా-హమారా, టీడీపీ- హమారా అంటూ నినాదాలు చేశారు.
చిత్రం..ముఖ్యమంత్రి అందించిన చాదర్తో మైనారిటీ నేతలు