ఆంధ్రప్రదేశ్‌

హోసూరులో త్వరలో తెలుగు సంఘ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 8: తమిళనాడులోని హోసూరులో నిర్వహించే తెలుగు సంఘం సమావేశానికి హాజరు కావాల్సిందిగా సంఘం అధ్యక్షులు, అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కేఈ మనోహరన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మనోహరన్ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తెలుగులో మనోహరన్ ప్రశ్నలు వేయగా ఆమె తెలుగులోనే సమాధానం ఇచ్చిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. తెలుగు మాట్లాడే ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారానికి మనోహరన్ కృషి చేస్తున్నారు. హోసూరులో అత్యధిక సంఖ్యలో తెలుగు భాష మాట్లాడే ప్రజలు ‘ మీరాక కోసం ఎదురు చూస్తున్నార’ని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అక్కడ మూతపడిన తెలుగు మీడియం పాఠశాలలను తిరిగి తెరిపించేందుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలుగు సంఘ సమావేశంతో పాటు త్వరలో పలు అభివృద్ధికార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.