ఆంధ్రప్రదేశ్‌

రేప్ చేసి, ఉరేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంపట్నం, జూలై 17: గుంటూ రు జిల్లా నిజాంపట్నం మండలం మహ్మద్‌వారిపాలెంలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో నే హతమార్చి మృతదేహాన్ని అక్కడే వదిలేసిన సంఘటన సంచలనం రేపింది. వారికి గ్రామస్తులు దేహశుద్ధి చేయటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌కె జాస్మిన్ (19) పదో తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన వేముల సాయి, జొన్నలగడ్డ పవర్‌కుమార్ బిటెక్, డిగ్రీ చదువుతున్నారు. రోజూ కళాశాల లేని సమయంలో వారు జాస్మిన్ ఇంటి వద్దకు వచ్చి అనుచితంగా ప్రవర్తించేవారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి, పవన్‌కుమార్ కలిసి జాస్మిన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరవాత విషయం బయటపడుతుందనే భయంతో బెల్ట్‌తో ఆమె గొంతు నులిమి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనంతరం ఇద్దరూ బయటకు వచ్చి జాస్మిన్ ఉరి వేసుకుంటున్నట్లు తమకు ఫోన్ చేసిందని చెప్పారు. ఇది విని ఇంట్లోకి వెళ్లిన కొందరు జాస్మిన్ ఉరివేసుకొని ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో గ్రామస్తులు సాయి, పవన్‌కుమార్‌లను పట్టుకొని కట్టేసి, తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న రేపల్లె సిఐ పెంచలరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసరావు సిబ్బందితో గ్రామానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగా సాయి ఆస్పత్రిలో మరణించినట్లు రేపల్లె టౌన్ సిఐ మల్లికార్జునరావు తెలిపారు.

చిత్రం... నిందితులను కట్టేసి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు