ఆంధ్రప్రదేశ్‌

రెండు బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముందుకు రెండు బిల్లులు రాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పంచగ్రామాలకు సంబంధించిన ఇళ్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లును ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2019 కార్మిక శాసనాల సవరణ బిల్లును కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.