ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్లకు బడ్జెట్లో రూ. 300 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 February 2019
అమరావతి, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించింది. పేద వర్గాలకు 5 రూపాయలకే భోజనాన్ని ఈ పథకం కింద అందిస్తున్నారు. దాతల విరాళాలతో పాటు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ పథకాన్ని పేదలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా175 నియోజకవర్గాలకు 368 క్యాంటీన్లు మంజూరు కాగా పట్టణాల్లో 216, గ్రామీణ ప్రాంతాల్లో 152, నాలుగు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీలలో మరో 160 ఏర్పాటయ్యాయి. ఏటా బడ్జెట్లో కేటాయింపులు పెంచటంతో పాటు మరిన్ని విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.