ఆంధ్రప్రదేశ్
శాసనమండలి చైర్మన్ పదవికి షరీఫ్ నామినేషన్ దాఖలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 February 2019
విజయవాడ, ఫిబ్రవరి 6: రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. మండలిలో నోటిఫికేషన్ వివరాలను చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ నామినేషన్లు స్వీకరించేందుకు గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసే సమయానికి ఎమ్మెల్సీ షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండలిలో చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నికల ఫలితాన్ని గురువారం 11.30 గంటలకు అధికారికంగా ప్రకటించన్నుట్లు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు.