ఆంధ్రప్రదేశ్‌

మోదీ నిజాలు బయట పెడతారేమోనని బాబు భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 9: ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో నిజాలు బయటపెడతారేమోననేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భయమని, ఈ కారణంతోనే మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. జీవీఎల్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుతో కలిసి సూర్యారావుపేటలోని ఒక హోటల్‌లో శనివారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆదివారం గుంటూరు పర్యటనలో రూ. 7వేల కోట్ల విలువైన రెండు చమురు కంపెనీలకు చెందిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన, బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సభలో పాల్గొంటారని తెలిపారు. గుంటూరులో జరిగే ప్రజా చైతన్య సభలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై వాస్తవాలు చెప్పనున్నారన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దేశ కళ్యాణం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు వంటి రాక్షసులు కొందరు దానిని అడ్డుకోడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ నిజాలు ఎంతోకాలం దాగవన్నారు. ప్రధాని మోదీ ఎక్కడ నిజాలు బయట పెడతారోనని బాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.