ఆంధ్రప్రదేశ్‌

డిజిపిగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: నూతన ఇన్‌చార్జి డిజిపిగా పదవి చేపట్టిన నండూరి సాంబశివరావు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎంకి పుష్పగుచ్చం అందజేశారు. నండూరి సాంబశివరావు నవ్యాంధ్రప్రదేశ్ అగ్నిమాపకశాఖ డీజిగా మెరుగైన సంస్కరణలు చేపట్టడంతోపాటు ప్రప్రథమంగా రాష్ట్ర స్థాయి అగ్నిమాపక కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండిగా పదవి బాధ్యతలు చేపట్టి కొద్ది నెలల కాలంలోనే ఆర్టీసిని ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ బస్‌స్టాండ్‌ను అత్యాధునిక వసతులతో కూడి అభివృద్ధి చేయడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చుకునే కేంద్రంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నండూరి సాంబశివరావు ఇన్‌చార్జి పాలనలో పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టేందుకు చర్యలు చేపడతానని ఆయన వెల్లడించారు.

చిత్రం..డిజిపిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న నండూరి సాంబశివరావు