ఆంధ్రప్రదేశ్‌

‘జగన్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: ఆర్థిక నేరగాడైన జగన్మోహనరెడ్డికి ప్రజలు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమయం అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ విమర్శించారు. ఆదివారం ఉండవల్లి ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఎవరు సమర్థులో ఆలోచించి ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా జరగని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కోర్టును ఆశ్రయించారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో 15లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల ఫలితాలపై వారి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయన్నారు. విద్య ముసుగులో వ్యాపారం చేస్తున్నవారు స్థాయి తెలుసుకుని మాట్లాడాలని, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. విద్యావేత్తల పేరుతో విద్యార్థుల్లో విషబీజాలు నాటవద్దని, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని యామినీ శర్మ హితవు పలికారు.