ఆంధ్రప్రదేశ్‌

మే 23 తరువాత ప్రమాణ స్వీకారం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో గురువారం జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఊహలకు అందని నిశ్శబ్ద విప్లవం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అది మీ ఊహకు అందని విప్లవమని తెలిపారు. విజయం ప్రజలు ఇస్తారని తెలిపారు. టీడీపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందో మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. మే 23 తరువాత మంచిరోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. జగన్‌కు ఓటు వేయడానికి ఇంతమంది పోలింగ్ కేంద్రాలకు వచ్చారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గుడు వస్తే, అరాచకాలే అని భయపడి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు వచ్చారని వివరించారు. పైకి చెబితే ఈ దుర్మార్గుడితో ఇబ్బందులు వస్తాయని అందరూ గుంభనంగా ఉన్నారన్నారు. చావడం, చంపడం వారిచ్చిన నినాదాలని గుర్తు చేశారు. జగన్ ఎక్కడ మాట్లాడినా ఇటువంటి మాటలే మాట్లాడుతారన్నారు. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా తప్పు ఒప్పుకున్నాడా అని ప్రశ్నించారు. వితండవాదం చేసే వ్యక్తికి మనం సర్దిచెప్పగలమా అని వ్యాఖ్యానించారు.