ఆంధ్రప్రదేశ్‌

నిత్యాన్నదానానికి పవన్ కళ్యాణ్ రూ. 1.32 కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకాకాని, ఏప్రిల్ 12: శ్రీదశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 1.32 కోట్ల రూపాయల విరాళం అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలో నాగార్జున యూనివర్శిటీ సమీపంలోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌కళ్యాణ్‌కు ఆలయ ధర్మకర్తలు అలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
స్వామివారికి పవన్‌కళ్యాణ్ శేషవస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదాన కార్యక్రమానికి 1.32 కోట్లు భారీ విరాళాన్ని సమర్పించారు. దేవస్థానంలోని భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ చేసి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణ భాస్కరరావు, స్వర్ణకుమారి, వెంకట సూర్య రాజశేఖర్, గణేష్, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.