ఆంధ్రప్రదేశ్‌

120కి పైగా సీట్లు గెలుస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 120కి పైగా సీట్లు గెలుస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి టీడీపీ అభ్యర్థులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై అభ్యర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని రకాల సర్వేలు, క్షేత్ర స్థాయి సమాచారం తీసుకున్నాకే ఈ మాట చెబుతున్నానని తెలిపారు. ఈ నెల 22న అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో ఉండవల్లిలో సమావేశం నిర్వహించనున్నానని తెలిపారు. అభ్యర్థులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. తాను 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నట్లు తెలిపారు. కర్నాటక రాష్ట్రం రాయచూర్‌లో శుక్రవారం ఏఐసీసీ అధినేత రాహూల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు. పీలేరులో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి దృష్టికి ఆ పార్టీ అభ్యర్థి కిషోర్‌కుమార్ రెడ్డి తీసుకువచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నామన్నారు.