ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రం గురించి జగన్ ఏం పట్టించుకుంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రెండురోజులుగా పులివెందులలో పండుగ వాతావరణంలో గడిపిన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి తన రక్త సంబంధీకుడు, స్వయానా బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఒక్క క్షణం కూడా ఆరా తీయలేదని, కనీసం పట్టించుకోలేదని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో గురువారం వర్ల మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఎక్కడ ఉన్నారని, ఏమైపోయారని, తండ్రి హత్య కేసును వదిలేశారా, ఎవరు ఆమె నోరు మూయించారు, హంతకులు ఎవరో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రి, ఎంపీగా పని చేసిన వ్యక్తి అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్యకు గురైతే పత్రికల్లో, టీవీల్లో కుటుంబ సభ్యులే చేయించారని వార్తలు వస్తుంటే సిట్ అధికారులు నోరు ఎందుకు మెదపటం లేదని వర్ల మండిపడ్డారు. పులివెందుల వెళ్లి తన బాబాయ్ హత్య గురించి ఆరా తీయని జగన్‌కు రాష్ట్రం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుందని, కుటుంబంలో తన బాధ్యతలను గాలికి వదిలేసిన జగన్ రాష్ట్రం గురించి ఆలోచిస్తాడనుకోవడం అతి పెద్ద పొరపాటన్నారు. ఇప్పటికైనా వివేకానంద రెడ్డి హత్య వెనుక అసలు గుట్టు బయటపెట్టాలని, ఎవరు చంపారు, ఎందుకు చంపారో వెల్లడించాల్సిన బాధ్యత పోలీసులదేనని, ఈ హత్యకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు.