ఆంధ్రప్రదేశ్‌

ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోలుగుంట, ఆగస్టు 8: విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డిపలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. పాత పెంకుటిల్లు కూలుస్తుండగా గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. వడ్డిప గ్రామానికి చెందిన గూడెపు రామన్నపాత్రుడు అలియాస్ కొండబాబు తన పాత పెంకుటిల్లు కూల్చి కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈమేరకు పాత పెంకుటిల్లు కూల్చేందుకు గ్రామానికి చెందిన లంక జానమ్మపాత్రుడు, లంక రాము, లంక చిన్న, కర్రి బాబూరావు, లంక వరహాలబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఐదుగురూ సోమవారం పాత పెంకుటిల్లు కూల్చే పనులు చేపట్టగా తూర్పు దిశగా ఉన్న గోడ కూలి వీరిపై పడింది. ఈ ప్రమాదంలో లంక జానమ్మపాత్రుడు (48), లంక రాము (30) అక్కడికక్కడే మృతి చెందారు. లంక చిన్న, కర్రి బాబూరావు, లంక వరహాలబాబుకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ప్రైవేట్ వాహనాల్లో తరలించారు. లంక చిన్న, కర్రి బాబూరావు పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.