ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: ఆర్టీసీలో పని చేసే దాదాపు 60 వేల మంది సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షులు, కమలాపురం ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తమ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గంతో కల్సి మంగళవారం ఆర్టీసీ భవన్‌లో సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబుతో కల్సి పలు అంశాలపై చర్చించారు. నూతన కార్యవర్గం సురేంద్రబాబును శాలువాతో సత్కరించింది. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి తనవంతు సహకారం ఉండగలదన్నారు. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా చంద్రయ్య, అధ్యక్షులు ఏ రాజారెడ్డి, ఉపాధ్యక్షులు డీ సూర్య ప్రకాశరావు, కార్యదర్శి ప్రసాద్, మంగమ్మ, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.