ఆంధ్రప్రదేశ్‌

24న కలెక్టర్లతో సీఎం జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తొలిసారిగా ఈ నెల 24న జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగనుంది. వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లోని కాన్ఫరెన్సు హాల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యం, ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, వ్యవసాయం, కరవు, మంచినీరు, తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.