ఆంధ్రప్రదేశ్‌

దహన సంస్కార ఖర్చులు రూ.15వేలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: ఎపీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్న, పదవీ విరమణ చేసిన సిబ్బంది దురదృష్టవశాత్తు మరణిస్తే వారి దహన సంస్కారాల కోసం వారి కుటుంబ సభ్యులకు సంస్థ చెల్లించే మొత్తం రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఈ చెల్లింపుల కోసం సర్ట్ఫికెట్లు పేరిట ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టరాదంటూ ఇప్పటివరకు అమల్లోనున్న నిబంధనలను సరళతరం చేశారు. మెడికల్ కారణాల రీత్యా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ ఖర్చులు చెల్లించే విధానం వర్తింపుచేయనున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు డెత్ సర్ట్ఫికెట్ కోసం ఒత్తిడి చేయవద్దని కూడా సురేంద్రబాబు ఆదేశాలు జారీ జేశారు. పైగా ఆ మొత్తాలను వారికి అందుబాటులో ఉన్న డిపోల నుంచి పొందే సౌలభ్యం కూడా ఏర్పాటు చేశారు.