ఆంధ్రప్రదేశ్‌

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు 3న ఓటర్ల జాబితా ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు వీలుగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి 1 ప్రాతిపదికగా, తుది ఒటర్ల జాబితాను మే 20న ప్రకటించారు. పంచాయతీల ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్దం చేసి, జూలై 3న ప్రకటించాలని ఎండీవోలకు, జిల్లా పరిషత్ సీఈవోలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.