ఆంధ్రప్రదేశ్‌

గుర్తింపు కార్డులెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఆగస్టు 11: పుష్కరాల్లో అత్యంత ప్రధానమైన పిండ ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణులకు నగరంలో చెదు అనుభవం ఎదురైయ్యింది. ప్రభుత్వ నిర్దేశించిన ఘాట్లలో వీరు పిండ ప్రధానం చేసేందుకు ప్రభుత్వం వీరి నుండి దరఖాస్తులను స్వీకరించారు. పుష్కరాల సమయం రావడంతో వీరంతా గురువారం ఉదయం పలు ప్రాంతాల నుండి నగరంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అధికారులు మాత్రం వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వీరు రైల్వే స్టేషన్‌లో ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు నాలుగు వందవల మంది పురోహితులు నగరానికి చేరుకున్నారు. కృష్ణ పుష్కరాలకు సంబంధించి పిండ ప్రధాన పురోహితుల కోసం ప్రభుత్వ దరఖాస్తులను ఆహ్వానించడంతో వీరంతా గత గురువారం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడికి చేరుకోగానే గుర్తింపు కార్డులు ఇస్తామని అధికారులు చేప్పడంతో వీరు గురువారం నగరానికి చేరుకున్నారు. నగరానికి చేరుకున్న తరువాత వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు సరికదా...వీరిని పట్టించుకునే వారే కరువౌయ్యారు. దీంతో వీరంతా రైల్వే స్టేషన్‌లో అందోళన బాట పట్టారు అయినప్పటికీ అధికారుల నుండి స్పందన రాకపోవడం పట్ల మరింత అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డలు లేని పక్షంలో పోలీసులు ఘాట్లకు అనుమతించరని, శుక్రవారం నుండి పుష్కరాలు ప్రారంభవౌతున్న సందర్భంలో వీరు మరింత అందోళనకు లోనౌతున్నారు.