ఆంధ్రప్రదేశ్‌

అమరావతిపై స్పష్టత ఏదీ? : నారా లోకేష్ ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 8: రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలను విస్మరించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్టపై దృష్టి పెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పనులపై సబ్ కమిటీ వేశారని, ఆ కమిటీ నాయకులు ఏసీ రూముల్లో ఉండి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కరకట్టపై ఉన్న నిర్మాణాలు అక్రమమా, సక్రమమా అనేది కోర్టు, సీఆర్డీఏ తేల్చాల్సి ఉంటుందని లోకేష్ అన్నారు. ఈ నెల 10 తరువాత రాజధాని అమరావతి రైతుల సమస్యలపై ఓ నిర్ణయం తీసుకుంటామని లోకేష్ వివరించారు. నియోజకవర్గ టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.