ఆంధ్రప్రదేశ్‌

గండి అంజన్నను దర్శించుకున్న సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, జూలై 8: కడప జిల్లా చక్రాయపేట మండలంలో గండి క్షేత్రంలో వెలసిన ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఇడుపులపాయలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన నేరుగా గండికి చేరుకున్నారు. సీఎంకు దేవస్థానం సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయస్వామికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు దేవస్థానం తరఫున స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేసి వేదపండితులు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎంపీ అవినాష్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.

చిత్రం...గండి ఆంజనేయస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్