ఆంధ్రప్రదేశ్‌

పార్టీ మారే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 21: తుదిశ్వాస వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రముఖ సినీ నటి, పార్టీ మహిళా నేత దివ్యవాణి స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్న పార్టీని, చంద్రబాబును విడిచి పెట్టి వెళ్లే ప్రసక్తే లేదని బుధవారం ట్విట్టర్ వేదికగా దివ్వవాణి స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న వారే నిజమైన నాయకులు అవుతారన్నారు. పార్టీ అధినేత, తన మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తున్నారని అందులో వాస్తవం లేదన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.