ఆంధ్రప్రదేశ్‌

కోలుకుంటున్న కంచి స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: అధిక రక్తపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్థానిక ఆంధ్రా హాస్పిటల్‌లో బుధవారం నాటికి పూర్తిస్థాయిలో కోలుకోగల్గారు. ఈ సందర్భంగా ఆసుపత్రి న్యూరాలజిస్టు డాక్టర్ పవన్ మాట్లాడుతూ స్వామీజీకి సోడియం, బిపి, షుగర్ లెవల్స్ అన్నీ కూడా సాధారణ స్థాయికి చేరాయని, మాట్లాడగల్గుతున్నారన్నారు. తనను సందర్శించడానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులతో స్వామీజీ మాట్లాడే ప్రయత్నం చేయబోగా వైద్యులు వారించారు. దీంతో స్వామీజీ అందరికీ ప్రసాదాలు అందజేశారు. ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి చేయబోతున్నామని వైద్యులు తెలిపారు. స్వామీజీ చేపట్టిన చాతుర్మాస్య దీక్ష సెప్టెంబర్ 16న ముగియనున్నందున ఆయన అప్పటివరకు నగరంలోనే ఉండనున్నారు.

ఆసుపత్రిలో కంచి స్వామి జయేంద్ర సరస్వతి