ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ క్రమేణ వరద తాకిడి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతానికి మొత్తం 70 గేట్లలో 25 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి 19వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి పంపుతూ కాలువలన్నింటికీ కలిపి ప్రస్తుతం కేవలం 3500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే ఇదే సమయానికి పులిచింతల వద్ద వదిలిన లక్షా, 50 వేల క్యూసెక్కుల వరద నీరు బుధవారం తెల్లవారుజాము సమయానికి ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కృష్ణాజిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలువలన్నింటికీ క్రమేణ మూసివేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ డెల్టా కాలువలన్నింటినీ మూసి వేశారు.