ఆంధ్రప్రదేశ్‌

నాడు ఇంగ్లీషు మీడియానికి అడ్డుపడలేదా: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 11: గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరపాలక పాఠశాలల్లో ఇంగీషు మీడియం ప్రవేశపెట్టిన సందర్భంలో తెలుగు పరిరక్షణకు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన యుద్ధం గుర్తు లేదా అని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. నగరపాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడిన విషయం మర్చిపోయారా అంటూ సోమవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ గుర్తు చేశారు. తెలుగు పరిరక్షణ అంటూ మీ పవిత్ర పత్రిక, మీరు చేసిన పరిరక్షణ ఉద్యమం ఇప్పుడు ఏమైంది అన్నారు. ఎందుకింత తెగులు.. తెలుగు లెస్సేనా.. అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయింది అంటూ నిలదీశారు.