ఆంధ్రప్రదేశ్‌

గుడ్లు వేయడానికి పులివెందుల గూండాలు వచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: హుదూద్ విలయంలో కల చెదిరి ముళ్ల పొదలా ఉన్న విశాఖపట్నాన్ని పూలదారిలా చేసిన నాయకుడు చంద్రబాబు.. అక్కడి ప్రజలకు ఈ విషయం విదితమే.. ఇప్పుడు పులివెందుల గూండాలు గుడ్లు వేయడానికి వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ప్రజలకు మంచికి, చెడుకి తేడా తెలుసని గురువారం ట్విట్టర్‌లో వెంకన్న పేర్కొన్నారు. అలాగే ప్రజలకు దున్నపోతుకు, పాలిచ్చే ఆవుకు తేడా కూడా తెలుస్తోందన్నారు.
విశాఖలో వైకాపా కుటిలయత్నం
శాంతికి మారుపేరయిన విశాఖపట్నంలో నేడు పులివెందుల నుంచి గుండాలు తెప్పించి అక్కడ విధ్వంసాన్ని సృష్టించేందుకు వైకాపా ప్రభుత్వం పన్నిన కుటిల ప్రయత్నం చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అక్కడి ప్రజలకు బాబు విలువ ఏంటో హుదూద్ సమయంలోనే తెలుసునని గురువారం ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ చేసిన బీభత్సం మొత్తాన్ని వైజాగ్ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
తానున్నానంటూ ముందుకొచ్చిన మగాడు
విశాఖ వాసులు కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానని ముందుకి వచ్చిన నాయకుడు, మగాడు ఒకడు.. దుప్పటి కప్పుకుని పడుకున్న నయవంచకుడు ఇంకొకడు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ఈ రోజు అదే వంచకుడు చంద్రబాబును వైజాగ్‌లో అడుగుపెట్టనివ్వము అంటూ కోడిగుడ్లతో పెయిడ్ ఆర్టిస్టులను సిద్ధం చేయించాడు.. ఇదే పరిస్థితి కొనసాగితే అవే గుడ్లు వైజాగ్ ప్రజలు తిరిగి అతడి మీదే వేస్తారని హెచ్చరించారు.