ఆంధ్రప్రదేశ్‌

స్పందనలో అర్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ రైతుభరోసా పథకం కింద మరో 10, 989 మందికి లబ్ధి చేకూరింది. స్పందన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులకు రూ.8,24,17,500ల మేర లబ్ధి చేకూర్చినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటికే ఈ పథకం కింద రాష్టవ్య్రాప్తంగా 46.58 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. అయితే వివిధ దశల్లో అర్హులైనప్పటికీ కొన్ని కారణాల రీత్యా రైతు భరోసా అందని రైతులు స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టుకున్నారని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా స్పందనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన 10,989 మంది రైతులకు రైతు భరోసా సాయం అందించినట్లు తెలిపారు.