ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 March 2020
విజయవాడ(సిటీ), మార్చి 5: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 4వ తేదీ నుండి ప్రారంభమైన పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ - 2 పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం అధికారులు రెండోనెంబర్ ప్రశ్నపత్రం సెట్ను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,69,203 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్న ద్వితీయ సంవత్సర పరీక్షల కోసం 1411 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే గురువారం నిర్వహించిన పరీక్షకు 12, 076 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వివిధ సెంటర్లలో మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.