ఆంధ్రప్రదేశ్
బీసీలకు తీరని అన్యాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 March 2020
విజయవాడ(సిటీ), మార్చి 5: శాసనమండలి రద్దుతో బీసీలకు తీరని అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఇస్తున్న చీకటి జీవోలతో స్థానిక సంస్థలలో బీసీలను పదవులకు దూరం చేస్తోందని టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మండలి రద్దుతో వేలాది మంది బీసీల పదవులకు సీఎం జగన్ మంట పెట్టారని గురువారం ట్విట్టర్లో అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చీకటి జీవో 558తో 16 వేల మంది బీసీ నాయకులకు స్థానిక సంస్థల్లో పదవులను సీఎం జగన్ దూరం చేశారని ఆరోపించారు. ఇప్పటికే బీసీల నిధులు 3432 కోట్లు జగన్ మింగేశారన్నారు. బీసీలంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.