ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో క్రికెట్ అభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బిసిసిఐ చీఫ్ సెలెక్టర్‌గా నియమితులైన ఎంఎస్‌కె ప్రసాద్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త బాధ్యతలు తీసుకోనున్న ప్రసాద్ స్వంత రాష్ట్రానికి పేరుతెచ్చేలా భారత క్రికెట్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రసాద్‌ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఎంఎస్‌కె సిఎంను కలిసిన సమయంలో డెప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపి గోకరాజు గంగరాజు, వర్ల రామయ్య తదితరులు ఎంఎస్‌కెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎంఎస్‌కె ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.

చిత్రం.. ఎంఎస్‌కెను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు