ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు భయం: ఆలపాటి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 March 2020
గుంటూరు, మార్చి 21: ఒకపక్క ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో పాటు రాష్ట్రంలో జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ఎన్నికల తంతు ప్రమాదకరంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా ప్రభావం రాష్ట్రంలో ఉద్ధృతమవుతున్నా ఖాతరు చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించిన జగన్ ప్రభుత్వం లోపాలను కప్పిపుచ్చుకుంటూ తన చర్యలను సమర్థించుకునే పనిలో ఉందన్నారు. దీంతో కరోనా వైరస్ కంటే వైసీపీ ప్రభుత్వాన్ని చూసే ప్రజలు ఎక్కువగా భయపడుతున్నారని ఆయనన్నారు.