ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ సుధాకరబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: మాజీ కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కర్నూలు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు, కాంగ్రెస్ నేత ఎం.సుధాకర్‌బాబు శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస గృహంలో తెలుగుదేశంలో చేరారు. మాజీ కార్పొరేటర్లు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులతో సహా మొత్తం 500 మందితో కలిసివచ్చి పచ్చ కండువాలు బాబుచే కప్పించుకున్నారు. మరో రెండు మాసాల్లో వీరి పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై తెలుగుదేశంలో చేరుతున్నానని అన్నారు.

చిత్రం.. పార్టీ కండువా కప్పి సుధాకరబాబును టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు