ఆంధ్రప్రదేశ్‌

లంచం అడిగాననడం అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 29 : ఓబులాపురం - కృష్ణపట్నం పోర్టుకు వేస్తున్న రైల్వే లైను కాంట్రాక్టర్లు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తమని తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికులకే పనులు, ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రైల్వే లైను కోసం భూములు సేకరిస్తున్నప్పటి నుంచే తాను వారికి సహకరించానన్నారు. కాని ఆ నాటి ఆ ప్రాజెక్టు మేనేజర్ కుందేటి రాము తప్పనిసరిగా స్థానికులకే ఇక్కడ పనులు పూర్తి అయ్యేంత వరకు పనులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని అలాంటివేమి ఇప్పటి వరకు జరగలేదన్నారు. పంచాయతీకి చెల్లించాల్సిన రాయితీ ఎగవేతకే తనపై కన్సంటెన్సీ కంపెనీ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.తాను డబ్బులు డిమాండ్ చేసి ఉంటే ఏ విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.