ఆంధ్రప్రదేశ్
రూ.11వేల కోట్లు వసూలు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 30 September 2016
హైదరాబాద్, సెప్టెంబర్ 29: కృష్ణా గోదావరి బేసిన్లో ఒఎన్జిసి చమురు, సహజవాయువు బావుల నుంచి రిలయన్స్ తన ఆధీనంలో ఉన్న కెజి డి 6 బావుల్లోకి గ్యాస్ను తరలించిందని సిపిఎం పొలిట్బ్యూరో పేర్కొంది. 2009 నుంచి 2015 మధ్య అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్ను తరలించినట్లు జస్టిస్ ఏపి షా కమిటీ నిర్ధారించిందన్నారు.
తరలించిన గ్యాస్ విలువ రూ.11 వేల కోట్లనువెంటనే రాబట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఉదాసీనత పనికి రాదని సిపిఎం పేర్కొంది. ఇకపై రిలయన్స్ సంస్థ అక్రమంగా గ్యాస్ను తరలించకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్రాన్ని కోరింది. రిలయన్స్ దుశ్చర్యల వల్ల కేంద్ర ఖజానాకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని పేర్కొంది.