ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఏకాకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబరు 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కలుపుకునేందుకు భారత్ దాడులకు దిగలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే శిక్షణా కేంద్రాలను, స్థావరాలపై మాత్రమే భారత సైన్యం దాడులు జరిపిందని చెప్పారు. ఉగ్రవాదంపై సైనిక చర్య చేపట్టేందుకు అన్ని దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు ముందే భారత్ వ్యూహాన్ని దేశ మాజీ ప్రధానులతోపాటు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా మోదీ తెలియచేశారని హరిబాబు చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాల మద్దతు కూడగట్టుకునే చర్యల్లో భాగమే ఈ దాడులు అని ఆయన అన్నారు.