ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి తర్వాత ‘స్థానికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయమై అధికార టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత 7 కార్పొరేషన్లు, 4 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి డిసెంబర్-జనవరిలోనే ఎన్నికలు జరిపించేందుకు ముఖ్యమంత్రి సిద్ధం కాగా, సీనియర్లు, కొందరు మంత్రులు సంక్రాంతి పండుగ తర్వాత పెడితే బాగుంటుందని సూచించడంతో బాబు అంగీకరించారు. ఆ ప్రకారంగా విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూ లు, తిరుపతి, కాకినాడ, ఒంగోలు కార్పొరేషన్లు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తెదేపా నాయకత్వం ఇప్పటినుంచే ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈపాటికే వాటిపై సమీక్షలు ప్రారంభించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కుల సమీకరణలు, ప్రత్యర్ధి పార్టీల బలాబలాపై కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా, సీరియర్లతోపాటు, యువనేతలనూ అక్కడ ఇంచార్జిలుగా నియమించాలని భావిస్తున్నారు. దానితోపాటు మిత్రపక్షమైన బిజెపితో సమన్వయం కూడా మరో సమస్య. ఒకరకంగా ఈ ఎన్నికలు లోకేష్‌కు సైతం సవాలే. అటు చంద్రబాబు కూడా ఇటీవలి జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికలను ప్రస్తావించారు. సమన్వయంతో వెళ్లాలని, తాను ఆ ఫలితాలు సీరియస్‌గా తీసుకుంటానని హెచ్చరించారంటే, బాబు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించారని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ గెలిస్తే మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, అంతకంటే ముందు జరిగే జడ్పీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే అధికార పార్టీ కష్టాల్లో పడక తప్పదు. రెండేళ్లకు ముందే వ్యతిరేక సంకేతాలు వెళితే, అది కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే తెదేపా నాయకత్వం తక్కువ స్థానాలయినా ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది.
కాగా, ఎన్నికలు జరిగే జిల్లాల్లో మాట వినని కలెక్టర్లు, కమిషనర్లను బదిలీ చేసేందుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు కొనసాగితే ఆశించిన ఫలితాలు రావని ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ నాయకత్వానికి సూచించగా, అందుకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. కడప, గుం టూరు, చిత్తూరు, ప్రకాశం కలెక్టర్లను మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొం దరు ఎస్పీలను కూడా బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు.