ఆంధ్రప్రదేశ్
నేడు గ్రామ సభలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 2 October 2016
హైదరాబాద్, అక్టోబర్ 1: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. సాధారణ ఖాళీల వల్ల సర్పంచ్లు లేని చోట ఉప సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కోరా. గ్రామ సభకు గ్రామంలోని ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు విధిగా పాల్గొనాలని, సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్లో గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రగతిని తెలియజేయాలని ఆయన సూచించారు.