ఆంధ్రప్రదేశ్‌

బోగీలను వదిలి వెళ్లిన గూడ్స్‌రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతగిరి, అక్టోబర్ 1: కిరండోల్- కొత్తవలస రైల్వే మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి వ్యాగన్లు విడిపోయయి. దీంతో మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం కిరండోల్ నుంచి విశాఖపట్నానికి ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలు బొర్రా, సిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య లింక్ తెగిపోయి ఇంజిన్‌తో వేరుపడింది. దీంతో ఇంజన్‌తో పాటు మూడు బోగీలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోగా మిలిగిన బోగీలు అక్కడే నిలిచిపోయాయి. దీనిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే బోగీలను వదిలి వెళ్తున్న గుడ్స్ ఇంజన్‌ను నిలిపివేశారు. అనంతరం మరో ఇంజిన్ వచ్చి విడిపోయిన భాగాలను తీసుకెళ్లింది. ఈ సంఘటనతో పాసిజర్ రైల్‌ను టైడా రైల్వే స్టేషన్‌లో ఉదయం పది గంటల నుంచి ఒంటిగంట వరకూ నిలిపివేశారు. మూడు గంటల పాటు ట్రైన్ నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.