ఆంధ్రప్రదేశ్‌

ఎస్వీయూలో జియో వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 2: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జియో వైఫై సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం రిలయన్స్ సంస్థ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్వీయూ విసి ఆవుల దామోదరంతోపాటు తన స్నేహితులు 20 మందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఎపి సిఇఓ రాజేష్ మాట్లాడుతూ 24 గంటలపాటు విద్యార్థులు జియో వై ఫై సౌకర్యాన్ని ఉచితంగా పొందేలా ఏర్పాటు చేశామన్నారు. ఎస్వీయూ ప్రాంగణంలోకి వెళ్లిన వారెవరైనా ఈ వై ఫై ద్వారా నెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. తమ సెల్‌లోని వై ఫైను తెరిస్తే ఒక కోడ్ వస్తుందని, ఆ కోడ్‌ను పొందుపర్చి ఉచితంగా వై ఫై సౌకర్యం పొందవచ్చని ఆయన తెలిపారు.