ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీ బాగుందనే తీసుకున్నాం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: స్వార్థ రాజకీయాలకు పాల్పడే వారికి భవిష్యత్ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం చంద్రబాబు విశాఖలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను కేంద్రం కొన్ని కారణాల వలన ఇవ్వలేకపోయింది. హోదాకు సరిపడ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు. రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశంతో ప్యాకేజీని తీసుకున్నాం. దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే కనీసం 30 వేల కోట్ల రూపాయలు కావాలి. అది కేంద్రమే భరిస్తానని చెప్పింది. దాన్నీ రాజకీయం చేయాలనుకోవడం సరికాదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ నీరు ఇటు విశాఖ వరకూ అటు పెన్నా నది వరకూ వస్తుంది. దీనివలన రాష్టమ్రంతా సస్యశ్యామలమవుతుందని అన్నారు.రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్లను మెరిట్ ఆధారంగా నియమిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.