ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: వేల అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన సాగిస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు కృషి చేయాలని ఏపిపిసిసి అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో ఏపిపిసిసి అధికార ప్రతినిధుల రెండ్రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. టిడిపి-బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్తకొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మీడియాను కూడా నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, పిసిసి అధికార ప్రతినిధులు సమర్ధవంతంగాటిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎదుర్కోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జన్మభూమి కమిటీల వరకూ చేరి పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు. వేలకోట్ల అవినీతి జరుగుతోందని, దీన్ని కాంగ్రెస్ ప్రతినిధులు సమర్ధవంతంగా తగిన సమాచారంతో ప్రజలకు చేర్చేలా కృషిచేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి-టిడిపి ప్రభుత్వాలు ప్రజలకు ద్రోహం చేశాయని, కాంగ్రెస్ పార్టీ హోదా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి 11 పార్టీలను సమీకరించిందని రఘువీరా చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో ప్యాకేజీల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు క్రెడిట్ వస్తుందని హోదాను అమలు చేయకుండా బిజెపి-టిడిపి కుట్ర చేశాయన్నారు. హోదా అమలు చేసేంతవరకు రాజీ లేకుండా కాంగ్రెస్ పోరాడుతుందని కెవిపి చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం మాట్లాడుతూ ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను, పునర్విభజన చట్టంలోని అంశాలను కొత్త ప్యాకేజీగా చెప్పడం బిజెపి-టిడిపిల పచ్చి మోసమని విమర్శించారు. శాసనమండలిలో విపక్ష నేత సి రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విపలమైందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ద్వారా వేల కోట్లు సంపాదించేందుకే పథకాలు రూపొందిస్తోందని, గతంలోని ప్రభుత్వాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు చేసేవని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాజధాని రహస్య ఒప్పందాలు, స్విస్ ఛాలెంజ్ విధానాలు అవినీతి సొమ్ముల కోసమే చంద్రబాబు చేపట్టారని, రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

చిత్రం.. విజయవాడలో గురువారం జరిగిన పిసిసి అధికార ప్రతినిధుల శిక్షణ శిబిరంలో ప్రసంగిస్తున్న రఘువీరారెడ్డి