ఆంధ్రప్రదేశ్
12వేల కోట్లు గల్లంతు అబద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 October 2016
హైదరాబాద్, అక్టోబర్ 18: అభివృద్ధి, పెట్టుబడులలో 12 వేల కోట్ల రూపాయల గల్లంతయ్యాయన్నది అబద్ధమని ఏపి సమాచారశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఖండించారు. కేవలం అంకెల్లో తేడాలను చూపి 12 వేల కోట్లు గల్లంతయ్యాయని చెప్పడం తగదన్నారు. సీఎం కోర్ డాష్బోర్డులో ఉన్న సమాచారం మేరకు తాము గణాంకాలు అందించామన్నారు. కేవలం ఊహలు, కల్పితాల ఆధారంగా పెట్టుబడులపై వార్తాకథనం ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వం అనేక ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితిలో మీడియా వాస్తవాలు తెలుసుకుని సహకరించాలని, కథనాలు రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలే తప్ప, పెట్టుబడులపై అనుమానాలు తలెత్తే భావన కల్పిస్తే ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని గ్రహించాలని కోరారు. సీఎం డాష్బోర్డు ఓపెన్ డాక్యుమెంటని స్పష్టం చేశారు.