ఆంధ్రప్రదేశ్‌

పర్సెంటేజీల కోసమే పట్టిసీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 22: రాయలసీమకు సాగునీరు అందిస్తామంటూ చేపట్టిన పట్టిసీమ నిర్మాణం కేవలం చంద్రబాబు ప్రభుత్వం పర్సంటేజీల కోసమేనని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాలు సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా రూపొందించాలని కాంగ్రెస్ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే టిడిపి నేతలు అవినీతికి పాల్పడి సొమ్ములు గుంజడానికి పట్టిసీమను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అమలుతోపాటు ఉత్తరాంధ్రాలో మూడు , రాయలసీమలో నాలుగు జిల్లాల అభివృద్ధికి చట్టంలో నాడు యుపిఏ పొందుపరిచినప్పటికీ కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే మంజూరు చేయడం విచారకరమన్నారు. ఈ ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు బాకా ఊదడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపి కెవిపి రామచంద్రారావు, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, కిల్లి కృపారాణి, కోండ్రు మురళీమోహన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డోల జగన్, చౌదరి సతీస్ తదితరులు ఉన్నారు.
chitram...
కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు