ఆంధ్రప్రదేశ్‌

బిటెట్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు, నవంబర్ 8: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజిలో మంగళవారం బిటెక్ మొదటిసంవత్సరం సివిల్ విద్యను చదువుతున్న కల్లూరి నాగలక్ష్మి(19) తన చున్నితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొదిలి మండలం తలమళ్ళ గ్రామానికి చెందిన కల్లూరి నాగలక్ష్మి (19) పేస్ ఇంజనీరింగ్ కాలేజిలో సివిల్ విభాగంలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో కాలేజి వసతిగృహంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శింగరాయకొండ, టంగుటూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతురాలి బంధువుల సమక్షంలో గది తలుపులు తెరిచి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా సింగరాయకొండ సిఐ భీమా నాయక్ విలేఖర్లతో మాట్లాడుతూ నాగలక్ష్మి మృతికిగల కారణాలు వెల్లడి కావాల్సి ఉందని తెలిపారు.