ఆంధ్రప్రదేశ్‌

రిటైర్డ్ ఎఎస్‌ఐ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, నవంబర్ 15: ఆస్తి వివాదాల నేపధ్యంలో కృష్ణా జిల్లా నందిగామలో రిటైర్డ్ ఎఎస్‌ఐ గుంజి వెంకటేశ్వరరావును మంగళవారం దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు సినీ ఫక్కీలో జరిగిన ఈ హత్యాకాండ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సేకరించిన సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాదులోని ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్‌ఐగా పని చేసి రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన గుంజి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన నందిగామ (స్థానిక బిసి కాలనీ)లో నివాసం ఉంటున్నాడు. కాగా ఆస్తి వ్యవహారాల్లో అతనికి, సోదరుడి కుమారులకు మధ్య గత కొంత కాలంగా వివాదం జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో బైక్‌పై వెంకటేశ్వరరావు ఇంటికి వెళుతుండగా నెహ్రూనగర్ ఆర్చి గేటు వద్ద ముగ్గురు యువకులు నిలుపుదల చేసి కత్తుల దాడి చేసి దారుణంగా గాయపర్చి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆయన్ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన పరిసర ప్రాంతాల దుకాణాలకు తాళం వేసి వెళ్లిపోయారు. హతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆస్తి వివాదాల నేపధ్యంలో సోదరుడి కుమారులు ఈ హత్యకు పాల్పడ్డారని మృతుడి భార్య పుష్ప పోలీసులకు, మీడియాకు వెల్లడించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. ఎఎస్‌ఐ వెంకటేశ్వరరావు మృతదేహం